న్యూఢిల్లీ: బెంగుళూరు నుంచి పాట్నా వెళ్తున్న గో ఫస్ట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మార్గ మధ్యలో నాగపూర్లో ఆ విమానాన్ని దింపేశారు. ఆ విమానంలో 139 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్లో లోపం తలెత్తడంతో కాక్పిట్ వార్నింగ్ వచ్చింది. దీంతో ఆ విమాన పైలెట్ ఇంజిన్లను షట్డౌన్ చేశాడు. దీనిపై గో ఫస్ట్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటన జారీ చేసింది. ఉదయం 11.15 నిమిషాలు విమానం సేఫ్గా ల్యాండైనట్లు తెలుస్తోంది. ప్రయాణికులందర్నీ విమానం నుంచి దింపి వారికి వసతులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4.45 నిమిషాలకు మరో విమానంలో ప్రయాణికులను పాట్నాకు తరలించనున్నట్లు గో ఫస్ట్ ప్రతినిధి తెలిపారు. విమాన ఇంజిన్లో లోపాన్ని ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు.