కోల్కతా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిందరంబరానికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హైకోర్టుకు బుధవారం చిదరంబరం ఓ కేసుకు సంబంధించి రాగా.. కాంగ్రెస్ సెల్ న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అంటూ నినదించడంతో పాటు బ్లాక్ రిబ్బన్స్ను ప్రదర్శించారు. టీఎంసీ సానుభూతి పరుడ, పశ్చిమ బెంగాల్లో పార్టీ పేలవమైన పనితీరుకు చిదంబరం వంటివారే కారణమని ఆరోపించారు. వార్త సంస్థ ఏఎన్ఐ రెండు నిమిషాల వీడియో షేర్ చేయగా.. ఇందులో చిదంబరం వంటి వారి వల్లే పార్టీ బెంగాల్లో నిలబడలేకపోయిందంటూ నినదించడం వినిపించింది.
‘టీఎంసీ దోచుకుంటే.. మీరు టీఎంసీని కాపాడుతున్నారు. మీలాంటి నాయకులతో తాము, పార్టీ బెంగాల్లో బాధపడుతున్నాం. మీరు మమతా బెనర్జీ ఏజెంట్’ అంటూ నినదించారు. అయితే, చిదరంబరానికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో స్పష్టంగా తెలియరాలేదు. అయితే, టీఎంసీ నేతకు సంబంధించిన కేసును వాదించేందుకు ఆయన కోల్కతా హైకోర్టుకు వచ్చినట్లు తెలుస్తున్నది. 2021 అసెంబ్లీ కాంగ్రెస్ బెంగాల్లో ఒక్క సీటును సైతం గెలువలేకపోయింది. ఓటు శాతం 2016లో వచ్చిన ఓట్ల శాతం కంటే 9 శాతం తగ్గింది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ 44 సీట్లు గెలుచుకున్నది. గతేడాది జరిగిన ఎన్నికల్లో దాదాపు 48 శాతం ఓట్లతో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ 215 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. బీజేపీ 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.
#WATCH | Congress leader & advocate P Chidambaram faced protest by lawyers of Congress Cell at Calcutta HC where he was present in connection with a legal matter. They shouted slogans, showed him black robes & called him a TMC sympathiser & responsible for party's poor show in WB pic.twitter.com/SlH4QgbJSn
— ANI (@ANI) May 4, 2022