న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ కార్మికులకు రెండో బూస్టర్ డోస్ ఇవ్వాలని పలువురు వైద్యులు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయను కోరారు. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రజలకు నాలుగో డోస్ ఇవ్వడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని, ముఖ్యంగా వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ కార్మికులకు ఇవ్వాలని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు జయలాల్ కోరారు. 30% మంది మాత్రమే బూస్టర్ వేసుకున్నారని, దీన్ని పెంచాలని ఐఎంఏ అధ్యక్షుడు సహజానంద్ సింగ్ సూచించారు.