పఠాన్కోట్: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ పఠాన్కోట్లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పంజాబ్కు సేవ చేసేందుకు అయిదేళ్లు అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరారు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వాణిజ్యాన్ని, పరిశ్రమలను లాభసాటిగా మార్చనున్నట్లు మోదీ తెలిపారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సభలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్కు జిరాక్స్ కాపీ ఆమ్ ఆద్మీ అని ఆయన విమర్శించారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సిక్కుల మనోభావాలను పట్టించుకోలేదని, పాక్లో ఉన్న గురు నానక్ నిర్యాణ స్థలం కర్తార్పూర్ సాహిబ్ను ఇండియా భూభాగంలోకి వచ్చేలా కాంగ్రెస్ చర్యలు తీసుకోలేకపోయిందని మోదీ ఆరోపించారు. సర్జికల్ స్ట్రయిక్స్పై ఆధారాలు అడిగిన కాంగ్రెస్ పార్టీపై కూడా మోదీ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ పాపాల లీలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు.