న్యూఢిల్లీ, జూలై 12: పీఎం కేర్స్ ఫండ్కు సంబంధించిన లావాదేవీలపై వివరణాత్మకంగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమైన అంశంపై ఒక్కపేజీలో సమాధానం ఇవ్వ డం తగదని పేర్కొన్నది. ప్రధానమంత్రి సహాయనిధి స్థానంలో మోదీ ప్రభుత్వం పీఎం కేర్స్ పేరిట ప్రభుత్వ నిధిని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని లావాదేవీలు, ఫండ్ వివరాలను వెల్లడించేందుకు పలు సందర్భాల్లో కేంద్రం నిరాకరించింది. పీఎం కేర్స్ పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి రాజ్యా ంగం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. మంగళవారం చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాల్లో సమగ్రంగా, వివరణాత్మకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. 2020, మార్చి 27న ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ను సృష్టించారు.