ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లో మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రతాప్గఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నిందితుల్లో ఒకడు ప్రయాగ్రాజ్-అయోధ్య హైవేలోని గంజేర్హా అటవీ సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మరో ఇద్దరు నిందితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
సాయంత్రం సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను గుర్తించి, దవాఖానకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.