జైపూర్: ఒక వ్యక్తి బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని, పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికను ఒక వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. పది రోజులుగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఈ నేపథ్యంలో బాధిత బాలిక తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. బలవంతపు పెళ్లి, లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేసింది.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం పోక్సో సెక్షన్తోపాటు, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని అజ్మీర్ ఏఎస్పీ మహమూద్ ఖాన్ తెలిపారు. బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.