న్యూఢిల్లీ, జనవరి 11: దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ వరుసగా ఏడోసారి టాప్ ప్లేస్ను దక్కించుకుంది. ఇండోర్తోపాటు సూరత్ కూడా సంయుక్తంగా తొలిస్థానంలో నిలిచింది. నవీ ముంబై మూడోస్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్కు తొమ్మిదో స్థానం దక్కింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం 2023 ఏడాదికిగానూ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్’ క్యాటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.