లక్నో: ఒక హోటల్లో తయారు చేస్తున్న రోటీలపై కుక్ ఉమ్మి వేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. సాహిబాబాద్ ప్రాంతంలోని మదీనా హోటల్లో రోటీలు తయారు చేసే వ్యక్తి వాటిపై ఉమ్మాడు. ఆ హోటల్ వద్ద ఉన్న హిందూ రక్షా దళ్కు చెందిన కార్యకర్త ఒకరు దీనిని గమనించాడు. తన మొబైల్లో రికార్డ్ చేశాడు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటనపై ఫిర్యాదు అందినట్లు సాహిబాబాద్ ఎస్పీ పూనమ్ మిశ్రా తెలిపారు. తిలా మోర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పారు. తయారు చేస్తున్న రోటీలపై ఉమ్మిన వ్యక్తిని తసీరుద్దీన్గా గుర్తించినట్లు చెప్పారు. అతడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు.
మరోవైపు గత ఏడాది మార్చిలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఒక హోటల్లో రోటీలు కాల్చుతున్న వ్యక్తి వాటిపై ఉమ్మి వేశాడు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Ghaziabad के पसौंडा स्थित मदीना होटल में रोटी पर थूकने का वीडियो हुआ वायरल, हिंदु रक्षा दल के कार्यकर्ता ने टीला मोड़ थाने में दर्ज कराई रिपोर्ट, आरोपी रोटी बनाने वाला गिरफ्तार, हिन्दू रक्षा दल के अध्यक्ष भूपेंद्र चौधरी के FB वाल पर पोस्ट है वीडियो @Uppolice @HinduRakshaDal pic.twitter.com/Z1HlIo5F7S
— Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 19, 2023
Delhi Police west district arrested two persons Mohammad Ibrahim and Anwar for spitting on tadoori rotis at a hotel in West Delhi.@DelhiPolice @DCPWestDelhi #DelhiPolice #Delhi pic.twitter.com/RnhNFJOK0n
— Jitender Sharma🇮🇳 (@jitendesharma) March 18, 2021