లక్నో: చావు ఎప్పుడు వస్తుందో అన్నది ఎవరికీ తెలియదు. ఒక జిమ్ ట్రైనర్ తన ఆఫీస్లోని కుర్చీలో కూర్చొని గుండెపోటుతో మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. 33 ఏళ్ల ఆదిల్కు ఘజియాబాద్లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో జిమ్ ఉంది. అతడు ప్రతిరోజూ అక్కడ వ్యాయామాలు చేసేవాడు. ఇటీవల అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించాడు. దీంతో షాలిమార్ గార్డెన్ ప్రాంతంలోనే మరో ఆఫీస్ తెరిచాడు.
కాగా, ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆ కార్యాలయంలోని కుర్చీలో కూర్చొని ఉన్న ఆదిల్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఒక్కసారి కుర్చీలో వెనక్కివాలి అలాగే ఉండిపోయాడు. గమనించిన సిబ్బంది అతడ్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆదిల్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆదిల్ మరణ వార్త తెలిసి అతడి కుటుంబం షాక్ అయ్యింది. అతడికి నలుగురు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా జర్వంతో బాధపడుతున్నట్లు చెప్పాడని, అయినప్పటికీ జిమ్కు వెళ్లడం అతడు మానలేదన్నారు. కాగా, ఆదిల్ కుర్చీలో కూర్చొని ఆకస్మికంగా మరణించిన సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.