న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అనర్హత వ్యవహారంపై జర్మనీ స్పందించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. జర్మనీ విదేశాంగ ప్రతినిధి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు తెలిసి రాహుల్ ఈ తీర్పుపై అప్పీల్ చేసుకొనే స్థితిలో ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా? లేదా అనేది తేలనున్నది. ఏ ప్రాతిపదికన అతడిపై అనర్హత వేటు వేశారనేది స్పష్టమవుతుంది’ అని పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయ స్వతంత్ర ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, జర్మనీ స్పందనపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ ధన్యవాదాలు తెలిపారు. రాహుల్గాంధీని వేధించడం ద్వారా భారత్లో ప్రజాస్వామ్యం ఎలా రాజీపడుతుందో గుర్తించినందుకు జర్మనీ విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. దేశ అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు.
మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి పాట్నా కోర్టు సమన్లు జారీచేసింది. వచ్చే నెల 12న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ హెచ్చరించాడు. బ్రిటన్లోని కోర్టులో రాహుల్ గాంధీపై పిటిషన్ వేస్తానని బెదిరించాడు.