బెంగుళూరు : ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హిందుస్థాన్ ఏరోనాటిల్ లిమిటెడ్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్ను రికవరీ చేశారు. ప్రధాని మోదీ కాన్వాయ్ రావడానికి 30 నిమిషాల ముందే ఆ స్టిక్స్ను సేకరించారు. వదరహల్లి గేటు వద్ద ఆ జెలాటిన్ స్టిక్స్ను గుర్తించారు. పోలీసు కానిస్టేబుల్ జగదీశ్తో పాటు ప్రత్యేక చెకింగ్ బృందానికి ఆ స్టిక్స్ దొరికాయి.
ఓ కవర్లో జిలాటిన్ స్టిక్స్ పెట్టారు. ఎన్ఐసీఈ రోడ్డు జంక్షన్కు 1 కిలోమీటరు దూరంలో స్టిక్స్ను గుర్తించారు. అనుమానాస్పద కవర్ కనిపించడంతో ఆ కానిస్టేబుల్ సీనియర్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ కేసులో ఇంకా ఎవర్నీ అరెస్టు చేయలేదు. పేలుడు పదార్థం ఎలా ఇక్కడకు చేరుకుందన్న కోణంలో సెంట్రల్ రేంజ్ డీఐజీ ఎస్ గిరీశ్ విచారణ చేపడుతున్నారు. కోరమంగళం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
అయితే ఆ రోజు బెదిరింపు కాల్ చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో పేలుడు జరుగుతుందని ఆ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని లోహిత్గా గుర్తించారు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని గుర్తించారు.