న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ను (Gautam Gambhir) చంపుతామని ఐఎస్ఐఎస్ కశ్మీర్ (ISIS Kasmir) నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయని మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు. బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్లోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై తాము దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. గంభీర్కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్ను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. 15 ఏండ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గౌతం గంభీర్ 2018లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.