న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా.. మన సైనికుల్ని పొట్టనపెట్టుకుంటున్నా, మన భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెడుతున్నా చైనా పట్ల ప్రధాని మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహలో కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా మాట్లాడుతూ చైనా ఎంత అరాచకంగా ప్రవరిస్తున్నా ఆ దేశంపై మోదీ ప్రేమ కురిపించడానికి ప్రధాన కారణం అదానీయే అని పేర్కొన్నారు. చైనాకు చెందిన ఒక కంపెనీతో అదానీకి సన్నిహిత సంబంధాలున్నాయని, ఆ కంపెనీ ద్వారానే భారత్లో అదానీ పలు ప్రాజెక్టులను చేపట్టారని తెలిపారు. ఆ కంపెనీ పేరు పీఎంసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని వెల్లడించారు. ఆ కంపెనీ చైనా దేశీయుడైన చాంగ్ చిన్ టింగ్కు చెందిందని, పలు అదానీ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్న చాంగ్ చింగ్ లింగ్ కుమారుడే టింగ్ అని ఆమె తెలిపారు. ఆ కంపెనీ భారత్లో అదానీ చిరునామాతోనే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్నారు. దేశంలోని ముంద్రా పోర్టు, దహేజ్ పోర్టు, ఏపీలోని విశాఖపట్నం పోర్టు, గుజరాత్లోని హజిరా పోర్టు, గోవాలోని మార్ముగావ్ పోర్టు పనులను పీఎంసీయే చేస్తున్నదన్నారు.