ఏడాదిలో రూ.165.50 భారం
న్యూఢిల్లీ, ఆగస్టు 17: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నాన్-సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.859.50కు చేరింది. ఇంతకుముందు జూలై 1న రూ.25.50 పెంచారు. ఏడాది కాలంలో మొత్తం రూ.165.50 పెరిగింది.