న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్యకు గురయ్యాడు. తీహార్ జైలులో మంగళవారం జరిగిన దాడిలో అతడు మృతిచెందాడు. ఓ కేసులో 2015 నుంచి టిల్లు అలియాస్ సునీల్ మాన్ తీహార్ జైలులో ఉంటున్నాడు. అదే జైలులో ఉన్న అతడి ప్రత్యర్థి వర్గానికి చెందిన యోగేశ్ తుండా అతడి అనుచరులు టిల్లుపై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
పోలీసులు టిల్లును దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని కాల్చి చంపిన కేసులో టిల్లు ప్రధాన నిందితుడు. దీంతో గోగి గ్యాంగ్కు చెందిన యోగేశ్ తుండా అతని అనుచరులు టిల్లుపై దాడులకు పాల్పడినట్టు తెలుస్తున్నది.