ముంబై, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నాథూరామ్ గాడ్సే పేల్చిన బుల్లెట్ వల్ల గాంధీజీ చనిపోలేదని వీర్ సావరర్ మునిమనవడు రంజిత్ సావరర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా జరుగలేదని, అందుకే గాంధీ హత్యతో నెహ్రూ కుటుంబానికి ఎకువ ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రచురించిన పుస్తకంలో పేరొన్నారు. ఫోరెన్సిక్ విచారణ ద్వారా ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. గాంధీ హత్య జరిగిన 20 ఏళ్ల తర్వాత కపూర్ కమిషన్ వేసినట్టే.. అణచివేయబడిన సాక్ష్యాలను బయటకు తీసుకురావడానికి మరో కమిషన్ వేయాలన్నారు.