బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ మిషన్లో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ను ఇస్రో గురువారం పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ ఇంజిన్ను 12 నిమిషాల పాటు మండించారు. పరీక్ష విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. మండించే సమయాన్ని కొద్ది కొద్దిగా పెంచుకొంటూ ఇంజిన్ను మరో నాలుగు సార్లు పరీక్షించనున్నారు. గగన్యాన్ ప్రాజెక్టు డిజైన్ దశ నుంచి టెస్టింగ్ దశకు చేరుకొన్నదని ఇస్రో చైర్మన్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు.