G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) ఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సమ్మిట్ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు (Delhi Cops) ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక విందు ప్లాన్ (Dinner Plan) చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ల వరకూ శిఖరాగ్ర సమావేశంలో అద్భుతమైన పని కనబరచిన సిబ్బంది జాబితాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా (Sanjay Arora) కోరినట్లు తెలిపారు. అరోరా సహా మొత్తం 450 మంది సిబ్బంది ఈ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ వారంలోనే జీ20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలో ఈ విందు ఉండే అవకాశం ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Tamil Nadu Farmer | ఆవుని చంపాయని పులులపై ప్రతీకారం.. విషంపెట్టి చంపిన రైతు
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 25వ ఘటన