న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పంటల మద్దతు ధరకు మోదీ సర్కారు ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీం’ (ఎంఐఎస్-పీఎస్ఎస్) పథకానికి గత మూడేండ్లుగా నిధులు తగ్గిస్తూ వస్తున్న బీజేపీ సర్కారు, ఈసారి పూర్తిగా నిలిపేసింది. 2020-21 బడ్జెట్లో ఈ పథకానికి రూ.2,288.33 కోట్లు కేటాయించగా, 2022-23లో రూ.1,500 కోట్లకు తగ్గించింది. సవరించిన అంచనాలను కూడా రూ.1,500 కోట్లుగానే పేర్కొన్నది. తాజాగా 2023-24 బడ్జెట్లో ఈ పథకానికి పైసా కూడా ఇవ్వలేదు.