న్యూఢిల్లీ, మే 17: పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్రోల్ ధరలను పోల్చుతూ పరిశోధక బృందం ఈ నివేదికను రూపొందించింది.
‘లీటరు పెట్రోల్ రేటు ప్రపంచ సగటు 1.22 డాలర్లు ఉండగా.. భారత్లో పెట్రోల్ రేటు 1.35 డాలర్లుగా ఉంది’ అని నివేదికలో పేర్కొన్నారు. భారత్ కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న కెన్యా, బంగ్లాదేశ్, నేపాల్, వెనిజువెలాలో కూడా పెట్రోల్ ధరలు చౌకగా ఉన్నాయి.