న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. మంగళవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.110.04కు పెరుగగా.. డీజిల్ ధర రూ.98.42కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.115.85కి ఎగబాకగా.. డీజిల్ ధర రూ.106.62కు పెరిగింది.