న్యూఢిల్లీ, జూలై 10: ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. శనివారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ తదితర రాష్ర్టాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటగా.. తాజాగా యూపీ, ఛత్తీస్గఢ్, నాగాలాండ్లోనూ రూ.100 దాటింది. మే 4 నుంచి ఇప్పటి వరకు 38 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలను కలిపి లెక్కిస్తే లీటరుపై రూ.10.51 పెరిగింది. ఇదే కాలంలో డీజిల్ ధర రూ.9.15 పెరిగింది.