న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ నెలలో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం బాగా తగ్గింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణం. గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. మరోవైపు, విమానాల్లో వినియోగించే ఏటీఎఫ్ కిలోలీటరుపై ఏకంగా రూ.277.5 పెరిగింది. దీంతో ఏటీఎఫ్ ధర కిలోలీటరకు రూ.1,13,202.33కి చేరింది. ఏటీఎఫ్ ధరలు పెరుగడం ఈ ఏడాదిలో ఇది ఎనిమిదోసారి.