తిరువనంతపురం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురై మునగసాగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోస్ట్గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ ద్వారా 12 మంది మత్స్యకారులను రక్షించారు. (Coast Guard Rescues Fishermen) కేరళలోని కొచ్చి తీరంలో ఈ సంఘటన జరిగింది. జనవరి 11న కొచ్చి సమీపంలోని మునంబమ్ పోర్ట్ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ‘సంజు’ అనే మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. బోటు కింద భాగం ధ్వంసం కావడంతో అందులోకి నీరు రావడంతో అది మునగసాగింది.
కాగా, ఆ పడవలోని మత్య్సకారులు కోస్ట్గార్డ్ను సహాయం కోరారు. దీంతో ఐసీజీఎస్ ఆర్యమాన్ నౌక, సీ-404, సీసి-144 బోట్లు, కోస్ట్ గార్డ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. 12 మంది మత్స్యకారులను రక్షించారు. మునుగుతున్న బోటును కూడా సురక్షితంగా తీరానికి చేర్చారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. కాపాడిన మత్స్యకారులకు ఆహారం, ప్రథమ చికిత్స అందిచినట్లు పేర్కొంది.