చెన్నై: తమిళనాడులో దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి పూర్తిస్థాయిలో అందుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మరో కీలక నేత పన్నీర్సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.