తరన్ తారన్, డిసెంబర్ 10: భారత్-పాక్ సరిహద్దులోని పంజాబ్లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి తరన్ తరన్ జిల్లాలోని సర్హలీ పోలీస్స్టేషన్ లక్ష్యంగా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పీజీ) దాడి జరిగింది.
అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పంజాబ్ డీజీపీ స్పందిస్తూ భారత్లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్థానే ఈ దాడికి కారణమని ఆరోపించారు. ఈ గ్రెనేడ్ చేతితో విసిరింది కాదని, సుదూర లక్ష్యాలపై దాడి చేసేందుకు వాడే రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ అని తెలిపారు.