న్యూఢిల్లీ, జూన్ 15: దేశంలో విభజన రాజకీయాలకు ఊపిరి పోసేందుకే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ సర్కార్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నదని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ మాట్లాడుతూ, ‘దేశ ప్రయోజనాలు, బీజేపీ రాజకీయ ఆకాంక్షలు వేర్వేరని కూడా కమిషన్ ప్రస్తావించింది. అలాంటప్పుడు ఈ అంశాన్ని మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారన్నది లా కమిషన్ ప్రకటనలో లేదు’ అని అన్నారు.
‘ఉమ్మడి పౌరస్మృతి’పై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్టు బుధవారం లా కమిషన్ ప్రకటించింది. ఆసక్తి గలవారు 30 రోజుల్లోగా లా కమిషన్కు ఈ మెయిల్ ద్వారా అభిప్రాయాలు పంపొచ్చంది.