న్యూఢిల్లీ: వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ఆరో ఫ్రెంచి నేత. తొలుత రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను భారత్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.
అయితే త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికలు, ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభం తదితర కారణాలతో ఆయన రాలేకపోతున్నట్టు వైట్హౌస్ వర్గాలు తెలియజేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ను ఆహ్వానించారు. రక్షణ, వాణిజ్యం, నూతన టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ తదితర రంగాలలో ఇప్పటికే భారత్-ఫ్రాన్స్ మధ్య పటిష్ఠ సంబంధాలు ఉన్నాయి.