న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మీడియాతో ఖర్గే మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఎప్పుడూ ‘యే మోడీ కీ సర్కార్, యే మోడీ కీ పార్టీ’ అని చెబుతారని, అందుకే బాండ్ల ద్వారా డబ్బు సంపాదించిన మోదీ దీనికి బాధ్యత వహించాలని అన్నారు.
కాగా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చిన వారిలో అనుమానితులు ఉన్నారని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. అలాంటి బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేదా ఆదాయపు పన్ను (ఐటీ) కేసులు లేదా ఇతర దర్యాప్తు సంస్థల దాడులకు గురయ్యారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్లాది డబ్బును బీజేపీ వసూలు చేసిందని ఆరోపించారు. అయితే చిన్న మొత్తంలో విరాళాలు అందుకున్న కాంగ్రెస్ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారని ఖర్గే విమర్శించారు.
#WATCH | Congress President Mallikarjun Kharge in Bengaluru, says, "The PM had said- "Na khaunga, na khane doonga". Today it has been exposed by Supreme Court how BJP made money out of electoral bonds." pic.twitter.com/wUADZHb6p7
— ANI (@ANI) March 15, 2024
#WATCH | Bengaluru | Congress President Mallikarjun Kharge says, "…Congress party accounts have been frozen. They (BJP) instructed I-T people to do this. Our nearly Rs 300 crores are frozen. How can we go for elections in this? Our accounts are closed but their accounts are… pic.twitter.com/kVKaBOI7Ge
— ANI (@ANI) March 15, 2024