న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత రేషన్ స్కీమ్ను మరో మూడు నెలలు పొడిగించారు. యోగి నేతృత్వంలోని క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. పేదలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు అందాలన్నది తమ ఉద్దేశమని డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ తెలిపారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ స్కీమ్ను కొనసాగించిన విషయం తెలిసిందే. యోగి విజయంలో ఈ స్కీమ్ కీలక పాత్ర పోషించింది. వరుసగా రెండవసారి యూపీ సీఎంగా యోగి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. యోగితో పాటు 52 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేశవ ప్రసాద్ మౌర్య .. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.