న్యూఢిల్లీ : ఈ ఏడాది నిర్వహించిన నాలుగో జాతీయ లోక్ అదాలత్లో ఇప్పటివరకు 1.17 కోట్ల కేసులను పరిష్కరించారు. వీటిలో 11.98 లక్షల పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి. జాతీయ లోక్ అదాలత్ల ద్వారా కక్షిదారుల డబ్బు, సమయం ఆదా కావడమే కాక, న్యాయ వ్యవస్థపై భారం కూడా తగ్గింది.
నల్సా ఆధ్వర్యంలో దేశంలోని 34 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ లోక్ అదాలత్ సేవలందిస్తున్నది. జాతీయ లోక్ అదాలత్ ద్వారా పలు పెండింగ్ కేసులు పరిష్కారమవుతున్నాయని నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. అయితే కొన్ని పాలనాపరమైన కారణాల వల్ల నాలుగో లోక్ అదాలత్ ఢిల్లీలో ఈ నెల 10న, ఛత్తీస్గఢ్లో 16న, తెలంగాణలో 30న నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.