రంగారెడ్డి, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో బలంగా తయారైంది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రంగారెడ్డి జిల్లా.. ప్రస్తుతం జిల్లా అంతా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. జిల్లాలో టీడీపీ పతనం రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతోనే మొదలైంది. రాష్ర్టాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించడంతో ప్రజలంతా గులాబీ పార్టీ వైపు నిలిచారు. ప్రత్యక్ష, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసి ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్దే అనేలా జిల్లాలో పార్టీ బలం పుంజుకున్నది. జిల్లాలో కారు దూకుడుతో ప్రతిపక్ష పార్టీలు ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నది. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుండడంతో జనం జై కొడుతున్నారు. ఒక్కొక్కరిగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను వీడి టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఒకరిద్దరు మినహా ముఖ్యనేతలతోపాటు కార్యకర్తలు కారెక్కారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు..
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతమైంది. గతంలో ఎండకాలం వస్తే తాగునీటి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం మిషన్ భగీరథతో ఇంటింటికీ సరిపడా తాగునీరు అందుతున్నది. రైతుబంధుతో ఎకరానికి రూ.5 వేల పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ రైతులను అప్పుల బారి నుంచి తప్పించింది. ఆత్మహత్యలకు పాల్పడే రైతు కుటుంబాలను ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమానూ అమలు చేస్తున్నది. మరోవైపు రూ.లక్ష పంట రుణాలను ఇప్పటికే ఒక దఫా మాఫీ చేయగా, రెండోసారి రుణమాఫీకీ చర్యలు చేపట్టింది. ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి వృద్ధులు, వితంతువులకు రూ.200ల నుంచి రూ.1000, దివ్యాంగులకు రూ.500ల నుంచి రూ.1500లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 పింఛన్ను రూ.2016, రూ.1500ల పింఛన్ను రూ.3016లకు పెంచి వారిలో భరోసా నింపారు. ఆహారభద్రతా పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నది. చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను మిషన్ కాకతీయ, ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక చేయూతనందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లాలోని ప్రతీ గ్రామానికి రోడ్లు వేయించడంతోపాటు గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లు, ప్రతీ గ్రామపంచాయతీల్లోనూ సీసీ రోడ్ల ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చించడంతో జిల్లా రూపురేఖలు మారాయి.
రెండో దశ తెలంగాణ ఉద్యమంలో ఎమర్జెన్సీలాంటి రోజులవి. రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా వెనకబాటుకు గురైంది పార్టీ అధినేత కేసీఆర్ ప్రజలకు కండ్లకు కట్టినట్లుగా వివరించారు. పల్లెలన్నీ రాష్ట్రం ఏర్పాటు కోసం నడుం బిగించాయి. జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బహిరంగ సభలు, సమ్మెలు, ర్యాలీలు, రైలు రోకోలు, ధర్నాలతో ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లాం. సడక్ బంద్, వంట వార్పులతో సకల జనులు రోడ్లపైకి వచ్చారు. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 14 ఏండ్లు అలుపెరగని పోరాటం తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. బంగారు తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం