జోద్పూర్: రాజస్థాన్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి నిప్పు అంటించి కాల్చి చంపారు. ఈ దుర్ఘటనలో ఆరు నెలల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. చాలా హేయమైన రీతిలో దుండగులు మర్డర్కు పాల్పడ్డారు. జోద్పూర్(Jodhpur) సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓసియాన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేపట్టింది. సీఎం గెహ్లాట్ స్వంత జిల్లాలోనే ఈ క్రైం జరగడం శోచనీయమని బీజేపీ ఆరోపించింది.
చౌరాయి గ్రామంలో గత రాత్రి ఈ ఘటన జరిగింది. పునరమ్ అనే 55 ఏళ్ల వ్యక్తి ఇంటిని దగ్ధం చేశారు. ఈ ఘటనలో పునరమ్తో పాటు ఆయన భార్య భన్వరి, కోడలు దాపు, ఆమె ఆరేళ్ల కుమార్తె అవశేశాలను గుర్తించారు. ఆ శరీరాలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. ముందుగా గొంతులు కోసి ఆ కిల్లర్స్ మర్డర్కు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కక్ష వల్లే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మర్డర్ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.