బొకారో: జార్ఖండ్లో మొహర్రం వేడుకల్లో(Moharram Procession) విషాదం చోటుచేసుకున్నది. పండుగలో భాగంగా నిర్వహించిన ఊరేగింపు నలుగుర్ని బలితీసుకున్నది. తాజియాతో ఊరేగిస్తున్న సమయంలో.. విద్యుత్తు తీగలకు తగిలింది. దీంతో కరెంట్ షాక్ వచ్చింది. విద్యుత్ షాక్ వల్ల నలుగురు వ్యక్తుల మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. బొకారో జిల్లాలోని పీటర్వార్ బ్లాక్లో ఉన్న ఖేటో గ్రామంలో ఈ ఘటన జరిగింది. హై టెన్షన్ కరెంటు తీగలకు తాజియా తగలడంతో షాక్ వచ్చింది.