Madhya Pradesh | భోపాల్, అక్టోబర్ 2: ఉజ్జయిని ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పంటపొలాల్లో పడేశారు.
ఆదివారం అశోక్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని బాధిత మహిళను శరోదాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. దాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురి పేర్లను బాధిత మహిళ పోలీసులకు తెలియజేసింది. ఘటనపై కేసు నమోదుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీస్ అధికారి చెప్పారు.