ఆగ్రా : తాజ్ మహల్లో ప్రార్థనలు చేసినందుకు నలుగురు పర్యాటకులను సీఐఎస్ఎఫ్ బుధవారం అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురు పర్యాటకులు హైదరాబాద్ వాసులు కాగా.. ఓ పర్యాటకుడు అజంగఢ్ వాసి. సీఐఎస్ఎఫ్ అధికారులు నలుగురిని తాజ్గంజ్ పోలీస్స్టేషన్లో అప్పగించగా.. పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే, తాజ్ మహల్లో శుక్రవారం మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఉంటుందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ రాజ్కుమార్ పటేల్ తెలిపారు. తాజ్ మహల్ పశ్చిమ భాగంలో షాహీ మసీదు ఉన్నది.
నిబంధనల ప్రకారం.. తాజ్ మహల్ శుక్రవారం పర్యాటకులకు మూసివేస్తారు. ఇక్కడ ఉన్న మసీదులో ప్రార్థనలు చేసే వారి కోసం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు తెరుస్తారు. అయితే, నలుగురు పర్యాటకులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెల రోజులుగా తాజ్ మహల్పై వివాదాలు చుట్టుముట్టాయి. గత నెలలో అయోధ్యకు చెందిన ఓ వ్యక్తి తేజోమహాలయ శివాలయంగా అభివర్ణించిన ఆయన.. ఈ మేరకు తాజ్ మహల్లో 22 గదులను తెరువాలని లక్నో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.