Lakhimpur Kheri | లఖింపూర్ ఖీరీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్తో రైతులను తొక్కించి చంపిన ఘటనకు మంగళవారంతో రెండేండ్లు పూర్తి అవుతున్నది. అయితే ఈ హింసాకాండ బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరుగలేదు. కేసు విచారణ నత్తనడకన సాగుతున్నదనే వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా ప్రస్తుతం బెయిల్పై బయట ఉండగా.. కేంద్ర మంత్రిగా ఉన్న అతని తండ్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలన్న రైతు సంఘాల డిమాండ్ను కేంద్రం పట్టించుకోలేదు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో భాగంగా రైతులు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2021, అక్టోబర్ 3న లఖింపూర్లో ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. లఖింఫూర్ ఘటనకు నిరసనగా ఈ నెల 3న ‘బ్లాక్ డే’గా పాటించనున్నట్టు రైతు సంఘాలు ఆదివారం ప్రకటించాయి. ప్రధాని మోదీ, అజయ్ మిశ్రా, ఆశిష్ మిశ్రా దిష్టిబొమ్మలు దహనం చేస్తామని తెలిపాయి.