Tamil Nadu | తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరక్కోణంలోని కిల్వీడి గ్రామంలో నిర్వహించిన ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులో పొంగల్ అనంతరం ఏటా ఆలయ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా భక్తులు క్రేన్కు వేలాడడం, దేవుడి ప్రతిమకు దండలు వేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాణిపేటలోని అరక్కోణం సమీపంలో గల కిల్వీడి గ్రామంలో ద్రౌపతి దేవీ ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరేగింపు చేపట్టారు. గ్రామంలోని వీధుల్లో దేవతా విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు భారీ క్రేన్ను వినియోగించారు.
క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో.. నలుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకుని ద్యాప్తు చేపట్టారు. ఉత్సవంలో క్రేన్ వినియోగించేందుకు అనుమతి లేదని పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
4 dead and 9 injured after a #CraneCollapsed during a temple festival event in Keelveethi in Arakkonam, #TamilNadu pic.twitter.com/LfpXJaCumr
— Smriti Sharma (@SmritiSharma_) January 23, 2023
Tamil Nadu | 4 people died & 9 others were injured after a crane collapsed during a temple festival event in Keelveethi in Arakkonam. There was no permission to use the crane. The crane operator is taken into custody. Investigation underway: Ranipet Collector Bhaskara Pandiyan pic.twitter.com/JefZ6CoBGB
— ANI (@ANI) January 23, 2023