గౌహతి: గౌహతి-హౌరా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయి. అస్సాంలోని చాయ్గావ్ స్టేషన్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గౌహతి-హౌరా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు ట్రాక్ మారుతుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ట్రైన్ డ్రైవర్ అలెర్ట్ అయ్యి వెంటనే నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని ఈశాన్య సరిహద్దు రైల్వే సీపీఆర్వో తెలిపారు. పట్టాలు తప్పిన రైలు బోగీలను సరి చేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు.