Road Accident | బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన నలుగురు సోదరులను మృత్యువు కబళించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నాదమ్ములు దుర్మరణం చెందారు.
మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లివాసులు కృష్ణ, సంజీవ్, సురేశ్, వాసుగా గుర్తించారు. సూరత్లో నివాసం ఉంటున్న వీరు.. స్వగ్రామంలోని బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.