న్యూఢిల్లీ: ఇటీవల బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై ఈడీ ఆమెకు గురువారం సమన్లు జారీ చేసింది. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి ఈ నెల 19న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది.
కాగా, మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై లోక్పాల్ సూచనల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందని నుంచి ముడుపులు తీసుకుని ప్రధాని మోదీ, అదానీ గ్రూప్లను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్టు ఆరోపణలు రావడంపై మొయిత్రాపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.