చెన్నై: తమిళనాడు మాజీ మంత్రి ఇందిరా కుమారి, ఆమె భర్త బాబు అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలారు. 1996లో ఆ ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన స్పెషల్ కోర్టు ఆ కేసులో ఇద్దరికీ అయిదేళ్ల జైలుశిక్షను విధించింది. 1990 దశకంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఆమె సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. 1991 నుంచి 96 మధ్య కాలంలో.. మంత్రిగా ఉన్న ఇందిరా కుమారి సుమారు 15.45 లక్షలు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలో స్పెషల్ కోర్టు ఈ కేసులో తీర్పును వెలువరించింది. ప్రభుత్వాధికారి షణ్ముగంకు కూడా మూడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.
సోషల్ వెల్ఫేర్ శాఖలో 1994 నుంచి 96 మధ్య అవకతవకలు జరిగాయని అప్పటి మంత్రి ఇందిరా కుమారిపై సీబీ సీఐడీ పోలీసులు కేసు బుక్ చేశారు. మాజీ అన్నాడీంకే నేత అయిన ఇందిరా.. 2006లో డీఎంకేలో చేరారు. మొత్తం 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యామ్నం భోజన పథకం కోసం అక్రమ రీతిలో సుండల్ పప్పును కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.