న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశంలో ప్రస్తుత ప్రభుత్వం అరాచక పరిస్థితులను సృష్టిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రధానిని పల్లెత్తు మాటన్నా జైల్లో తోసేస్తున్నారని విమర్శించారు. ఓ జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దేశంలోని తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. ‘ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒకవేళ నేను బహిరంగంగా ప్రధానమంత్రిని విమర్శిస్తే.. అప్పటి నుంచే కొందరు నన్ను వెంటాడటం మొదలుపెడతారు. అరెస్టు చేస్తారు. ఏ కారణం చెప్పకుండా జైల్లో తోసేస్తారు’ అని వ్యాఖ్యానించారు.