న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి 21 వేల సూచనలు అందినట్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 81 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది. ఏకకాల ఎన్నికలపై దేశంలోని 46 పార్టీల అభిప్రాయాన్ని కోరామని, ఇప్పటివరకు 17 రాజకీయ పార్టీల నుంచి సూచనలు అందాయని వెల్లడించింది.