భువనేశ్వర్ : ఒడిశా మాజీ సీఎం హేమానంద బిస్వాల్ కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద.. ఒడిశాకు ముఖ్యమంత్రిగా రెండు సార్లు సేవలందించారు. తొలిసారి డిసెంబర్ 7, 1989 నుంచి మార్చి 5, 1990 వరకు ఆయన ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబర్ 6, 1999 నుంచి మార్చి 5, 2000 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒడిశాలో తొలి గిరిజన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కారు.
Former Chief Minister of Odisha Hemananda Biswal passed away in Bhubaneswar today
— ANI (@ANI) February 25, 2022