న్యూఢిల్లీ, మార్చి 1: మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా క్యాన్సర్తో మృతి చెందారు. 28 ఏండ్ల రింకీ చక్మా గత రెండేండ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఈ మేరకు ఫెమినా మిస్ ఇండియా సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేసింది.
తనకు సోకిన మహమ్మారి గురించి రింకీ గత నెలలోనే ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. కాగా, మానూషి చిల్లర్ 2017లో మిస్ ఇండియా అవార్డు గెలిచినప్పుడు రింకీ చక్మా ‘బ్యూటీ విత్ పర్పస్’ అవార్డును నెగ్గింది.