న్యూఢిల్లీ: మాల్దీవులు మాజీ మంత్రి భారత జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేయటం వివాదాస్పదంగా మారింది. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారగా, దీనికి ఆజ్యం పోసేలా మాజీ మంత్రి మరియం షియునా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తన దేశంలోని విపక్ష మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీని విమర్శిస్తూ ఆమె తాజాగా పోస్టు చేశారు. ఆ పార్టీ పోస్టర్లో మన జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని ఉపయోగించటం విమర్శలకు దారితీసింది. దాంతో ఆమె ‘ఎక్స్’లో క్షమాపణలు చెప్పారు. ‘ఇటీవల పంపిన పోస్ట్పై చింతిస్తున్నాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉంటా’నని వివరణ ఇచ్చుకున్నారు.