ముంబై, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి(86) శుక్రవారం కన్నుమూశారు. జోషికి గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం హిందుజా దవాఖానలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే సన్నిహితులలో జోషి ఒకరు.
ముంబై మేయర్గా, శాసన మండలి సభ్యులుగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, శివసేన తొలి ముఖ్యమంత్రిగా అనేక పదవులు నిర్వహించారు. 1968లో ముంబై కార్పొరేషన్ కౌన్సిలర్గా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1995-99 మధ్యకాలంలో జోషి మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 2002-04 మధ్య వాజ్పేయి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్గా సేవలందించారు.