న్యూఢిల్లీ : చంద్రయాన్-3 (Chandrayaan-3) మరికొద్ది గంటల్లో జాబిల్లిపై అడుగుపెట్టనుండగా ఇస్రో మాజీ సైంటిస్ట్ అన్నాదురై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 14న శ్రీహరికోట నుంచి నింగికెగిసిన స్పేస్క్రాఫ్ట్ 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా 70 డిగ్రీల అక్షాంశం దగ్గర అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవుతుందని, చంద్రుడి ఉపరితలంలో సేఫ్ ల్యాండింగ్ అవడం ద్వారా చంద్రయాన్ చరిత్ర సృష్టిస్తుందని అన్నాదురై ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకూ మిషన్ అనుకున్న విధంగా కొనసాగుతున్నదని, ప్లాన్ ఏకు అనుగుణంగానే ఈరోజు చంద్రయాన్ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రయాన్-1లో చంద్ర మండలంలో నీరు ఉందని వెల్లడవడంతో ప్రపంచం చంద్ర మండలాన్ని భిన్నంగా చూడంటం మొదలుపెట్టిన తరహాలోనే చంద్రయాన్-3 సైతం చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా విజయవంతంగా ల్యాండ్ అవుతుందని అన్నారు.
అందరిలాగా తాను కూడా చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కోసం ఉత్కంఠగా వేచిచూస్తున్నానని అన్నారు. భారత్ మిషన్తో అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఐరోపా సహా పలు దేశాలు భారీ మిషన్లు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ గురించి ప్రస్తావిస్తూ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇప్పటికే మన ఉనికిని చాటామని, చంద్రయాన్-1తోనూ మన ఉనికిని చాటామని చెప్పుకొచ్చారు. ఆ ప్రదేశంలో ఇప్పటివరకూ మనం చేపట్టిన మిషన్కు చంద్రయాన్-3 విస్తరణగా ఉంటుందని అన్నాదురై విశ్లేషించారు.
Read More :
Pradeep Sharma: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు.. పోలీసు ఆఫీసర్కు సుప్రీం బెయిల్